Top News

Minster Uttam Speech | సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదలపై ప్రత్యేక దృష్టి

 


సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదలపై ప్రత్యేక దృష్టి  

జాతీయ పథకం ద్వారా నిజాంసాగర్ పూడికతీత, 17 నుంచి 25 టీఎంసీలకు పెంపు  

దేశంలోనే అత్యధిక పంట తెలంగాణలోనే  

మెడిగడ్డ బ్యారేజ్‌లో డిజైన్ లోపం  

కాంగ్రెస్ హయాంలో సన్న బియ్యం  

సిద్దపూర్ రివైజ్డ్ ఎస్టిమేట్  

ప్రధానకాలువ వెంబడి సోలార్ పవర్

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగం

106 కోట్ల జాకోర పథకం ప్రారంభం, సిద్దపూర్‌కు 200 కోట్లు మంజూరు  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 10: రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించారు. ఉదయం 11.25 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా వర్ని మండలం సిద్దపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. హెలికాప్టర్ వద్ద భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు పూలు జల్లుతూ మంత్రికి ఘన స్వాగతం పలికారు. గిరిజన మహిళలు సైతం పూలతో స్వాగతం పలికారు. మంత్రి రాకతో సిద్దపూర్ రిజర్వాయర్ పరిసరాలు సందడిగా మారాయి.  

రిజర్వాయర్ పనుల పరిశీలన  

అనంతరం సిద్దపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో పనుల పురోగతిపై ఆరా తీశారు.  మధ్యాహ్నం 12 గంటలకు జాకోర మరియు చందూర్ ఎత్తిపోతల పథకాన్ని మెయిన్ స్విచ్ ఆన్ చేసి మంత్రి ప్రారంభించారు.  అనంతరం జాకోరా లో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.

106 కోట్లతో జాకోర పథకం ప్రారంభం  

బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. 106 కోట్లతో నిర్మించిన జాకోర పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సిద్దపూర్ రిజర్వాయర్ కోసం 200 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. వర్ని, చందూర్, మోస్రా మండలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 7,500 ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. ఈ కాలువలకు సోలార్ పవర్ ఏర్పాటు చేయాలని నీటి పారుదల శాఖ కార్యదర్శిని ఆదేశించారు.  

సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదలపై ప్రత్యేక దృష్టి  

సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదలపై ప్రత్యేక దృష్టి సారించారని,  రాష్ట్రం లో పెండింగ్లో  ఉన్న ప్రాజెక్టు లకు రూ. 5 వేల కోట్లు మంజూరు చేశారని తెలిపారు.   ఉ మ్మడి నిజామాబాద్ జిల్లాకు జలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నిజాం కట్టిన గొప్ప ప్రాజెక్టు నిజాంసాగర్ అని, పూడిక వల్ల నిల్వ సామర్థ్యం తగ్గిందన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ సామర్థ్యం 17 టీఎంసీలుగా ఉందని, దాన్ని 25 టీఎంసీలకు పెంచుతామన్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువ వెంబడి సోలార్ పవర్ ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు డిజైన్, ఎస్టిమేట్ తయారు చేయాలని ఇరిగేషన్ శాఖ రాష్ట్ర కార్యదర్శిని ఆదేశించారు.  

జాతీయ పథకం ద్వారా పూడికతీత  

కడెం సహా రాష్ట్రంలోని మూడు ప్రాజెక్టులను జాతీయ పథకం ద్వారా పూడిక తీస్తున్నామని తెలిపారు. నిజాంసాగర్‌ను కూడా పూడికతీత ద్వారా 17 టీఎంసీల నుంచి 25 టీఎంసీలకు పెంచుతామన్నారు.  

దేశంలోనే అత్యధిక పంట తెలంగాణలో  

దేశంలోనే అత్యధిక పంట పండింది తెలంగాణలోనే అని, 295 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ప్రభుత్వం అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసిందని, 1.67 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 35 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు.  

మెడిగడ్డ బ్యారేజ్‌లో డిజైన్ లోపం  

ఇరిగేషన్‌కు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, మెడిగడ్డ బ్యారేజ్ డిజైన్ లోపభూయిష్టంగా ఉందన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. వందేళ్ల క్రితం కట్టిన నిజాంసాగర్‌కు ఏమీ కాలేదని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మెడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. కాంగ్రెస్ నిర్మించిన పోచంపాడ్ ప్రాజెక్టు ఇప్పటికీ బాగుందని, కాళేశ్వరంలో పూర్ కన్స్ట్రక్షన్ ఉందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.  

కాంగ్రెస్ హయాంలో సన్న బియ్యం  

కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు దొడ్డు బియ్యం వచ్చేవని, కాంగ్రెస్ వచ్చాక సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. గత పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇప్పుడు 1.05 కోట్ల రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు.  

సిద్దపూర్ రివైజ్డ్ ఎస్టిమేట్  

సిద్దపూర్ ప్రాజెక్టుకు రివైజ్డ్ ఎస్టిమేట్ చేస్తామని, రూ. 200 కోట్లు మంజూరు చేస్తామని, ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ వయసులో కూడా ప్రజల కోసం పనిచేస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటం బాన్సువాడ ప్రజల అదృష్టమని కొనియాడారు. ఈ పంటకు నిజాంసాగర్ నుంచి నీరు అందిస్తామని భరోసా ఇచ్చారు.  

బహిరంగ సభలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి  

అనంతరం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. రెండు రోజులు అన్నం లేకపోతే ప్రాణం ఉండదని, రైతుకు భూమి, విత్తనం, శ్రమతో పాటు నీరు ముఖ్యమని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన మొదటి పథకం జాకోర ఎత్తిపోతల పథకమని గుర్తు చేశారు.  

లక్షా 48 వేల ఎకరాలకు సాగునీరు  

బాన్సువాడ నియోజకవర్గంలోని 9 మండలాలు, ఒక మున్సిపాలిటీ పరిధిలో 61 వేల కుటుంబాలు ఉన్నాయని, మొత్తం లక్షా 48 వేల ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఇందులో 30 వేల ఎకరాలకు బోర్ల సౌకర్యం ఉండగా, 24 వేల ఎకరాలకు నిజాంసాగర్ నీరు అందడం లేదన్నారు. సిద్దపూర్ నుంచి 13 వేల ఎకరాలకు, జాకోర నుంచి 10 వేల ఎకరాలకు రెండు పంటలకు నీరు అందిస్తామని చెప్పారు. ఈ పథకాలు వందేళ్లు ఉంటాయని, బాన్సువాడ నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా నీరు లేకుండా ఉండదని స్పష్టం చేశారు. ఎకరానికి రెండు పంటలతో 70 క్వింటాళ్ల దిగుబడి వచ్చి 1.50 లక్షల ఆదాయం మిగులుతోందని, సెగ్మెంట్‌లో 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని తెలిపారు. ఏప్రిల్‌లో కాంతాలు పోసి నాట్లు వేసుకుంటున్నామని, తమది ఆదర్శ నియోజకవర్గమని అన్నారు. చింతకుంటకు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.  ఈ సందర్బంగా పోచారం భాస్కర్ రెడ్డి మంత్రి ని ఘనంగా సన్మానించారు.

హాజరైన ప్రముఖులు  

ఈ కార్యక్రమాల్లో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఇంచార్జి సీపీ రాజేష్ చంద్ర, నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠీ, మార్కెట్ కమిటీ వర్ని అధ్యక్షులు సురేష్ బాబా పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


































ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత  
పూడికతీతతో నిజాంసాగర్, శ్రీరాంసాగర్ నీటి నిల్వ సామర్థ్యం పెంపు  
కాలువ కట్టలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి తక్షణ చర్యలు  
మేడిగడ్డ పునరుద్ధరణకు కృషి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  
జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాల ప్రారంభం  
సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల పరిశీలన  

నిజామాబాద్, జూన్ 10: ఉత్తర తెలంగాణ జిల్లాలలోని సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 

సిద్దాపూర్ రిజర్వాయర్ పరిశీలన  
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కార్ తదితరులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిజర్వాయర్‌కు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. 

జాకోరా, చందూర్ ఎత్తిపోతల ప్రారంభం  
106 కోట్ల రూపాయల వ్యయంతో 7,975 ఎకరాల ఆయకట్టుకు నీరందించే జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాలను మంత్రి అట్టహాసంగా ప్రారంభించారు. హెలికాప్టర్‌లో సిద్దాపూర్ చేరుకున్న మంత్రికి ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ సురేష్ శెట్కార్, నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర, అధికారులు ఘన స్వాగతం పలికారు.  

ప్రతి ఎకరాకు సాగు నీరు  
జాకోరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి ఎనలేని ప్రాముఖ్యత ఇస్తోందన్నారు. భూసేకరణ, అటవీ అనుమతులు, ఆర్ అండ్ ఆర్ కోసం ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  

పూడికతీతతో నిల్వ సామర్థ్యం పెంపు  
లోయర్ మానేరు, మిడ్ మానేరు డ్యామ్‌లు, కడెం ప్రాజెక్టులలో నీటి నిల్వ సామర్థ్యం పెంపొందించేందుకు పూడికతీత చేపడుతున్నామని తెలిపారు. అదే తరహాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్, ఉత్తర తెలంగాణకు కీలకమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులలో కూడా పూడికతీత చేపట్టి రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పెంపొందిస్తామని ప్రకటించారు. కాలువ కట్టలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  

మేడిగడ్డ పునరుద్ధరణకు కృషి  
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి లోపభూయిష్ట నిర్మాణం, డిజైన్ల వల్ల కొన్నాళ్ళకే కూలిపోయిందని మంత్రి ఆక్షేపించారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. నిజాం నవాబు నిర్మించిన నిజాంసాగర్, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్, నాగార్జున సాగర్, జూరాల ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని గుర్తు చేశారు.  

సిద్దాపూర్‌కు నిధుల హామీ  
సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల పూర్తి కోసం సవరించిన ప్రతిపాదనల మేరకు అవసరమైన నిధులను తప్పక కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లు కలుపుకుని 295 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. 145 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 48గంటల లోపే రూ.35 వేల కోట్లు రైతుల ఖాతాలలో జమ చేశామన్నారు.  

సన్న బియ్యం పంపిణీ  
నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 5లక్షల కుటుంబాలలోని 3.25 కోట్ల మందికి ఒక్కొక్కరికి ప్రతీ నెల ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.  

పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు  
ప్రభుత్వ సలహాదారు, స్థానిక శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటగా తన నియోజకవర్గంలో జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో లక్షా 48 వేల ఎకరాలలో పంటలు పండిస్తున్నారని, 95వేల ఎకరాలకు నిజాంసాగర్ నీరు అందుతోందని తెలిపారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పూర్తయితే నియోజకవర్గంలో సాగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని, పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిని కోరారు.  

హాజరైన ప్రముఖులు  
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్ రావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్, సీ.ఈ శ్రీదేవి, బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, తహసిల్దార్ ప్రశాంత్, సర్పంచ్ సాయిలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم