ఉమ్రా యాత్రకు వెళ్తున్న ఇద్దరికి బాన్సువాడలో ఘన సన్మానం
మక్కా షరీఫ్ లో ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించాలని కోరిన స్నేహితులు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూలై 12: సౌదీ అరేబియాలోని మక్కా షరీఫ్ కు ఉమ్రా యాత్ర నిమిత్తం బాన్సువాడ నుంచి వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్ వసీ, అమీన్ పటేల్ లను వారి స్నేహితులు ఆదివారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర ఉమ్రా యాత్రలో బాన్సువాడ ప్రాంత అభివృద్ధికి, ప్రజలందరి సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు. యాత్ర సుఖంగా సాగాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాగ్వాన్ అధ్యక్షుడు కాజీం, అలీం యాహియా, అజాజ్, షఫీ, రియాజ్, బడే అమీన్, రాజీ, జహీం, అమీర్, ఆఫ్రిది, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق