Top News

MJP Inspected by RDO |కస్తూర్బ గురుకులాన్ని తనిఖీ చేసిన ఆర్డీఓ

కస్తూర్బ గురుకులాన్ని తనిఖీ చేసిన ఆర్డీఓ 

నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం : ఆర్డీఓ 

ఘటన పై సమగ్ర విచారణ 

తెలంగాణ డైలీ న్యూస్, బీర్కూర్ : 

బిర్కూర్ మండలంలోని MJP స్కూల్‌కు చెందిన 12 మంది విద్యార్థులు అనుమానిత ఆహార విష లక్షణాలతో బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

విషయం తెలుసుకున్న వెంటనే RDO ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులందరూ ప్రస్తుతం నిలకడగా ఉన్నారని, వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారని ఆయన తెలిపారు.

అనంతరం RDO, బిర్కూర్ తహసీల్దార్, MPDO  కలిసి MJP స్కూల్‌ను సందర్శించారు. స్కూల్ వంటగదిలో ఆహార తయారీ, నిల్వ, పరిశుభ్రత ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వంట సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. అదేవిధంగా తరగతి గదిలో విద్యార్థులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితి, సంక్షేమం గురించి ఆరా తీశారు.

ఈ ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, వివరాలతో కూడిన నివేదికను త్వరలో జిల్లా ఉన్నతాధికారులకు సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు.







Post a Comment

أحدث أقدم