Discussion on Nominated Posts | నామినేటెడ్ పోస్టుల భర్తీపై సి ఎం సమీక్ష

 



సీఎం రేవంత్‌తో మీనాక్షి, మహేష్‌కుమార్ భేటీ

నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించిన నేతలు

డీలిమిటేషన్ వల్ల తెలంగాణకు నష్టం జరిగితే..

పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ

తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో, హైదరాబాద్: 

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో బుధవారం సాయంత్రం ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా నామినేటెడ్ పదవుల భర్తీపై  నేతలు చర్చించారు. నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా  సమావేశం సాగింది. ఫెడరేషన్ చైర్మన్ల నియామకం పై  చర్చలు కొలిక్కి వచ్చాయి... రెండు రోజుల్లో జి.ఓ లు వచ్చే అవకాశం ఉంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, కార్యదర్శులు, ఇతర ఆర్గనైజేషన్ పోస్టులపై లోతుగా నాయకులు చర్చించారు. మండల కమిటీలు, బీఎల్ ఏ 2 లపై కూడా చర్చలు సాగాయి. కేంద్రం చేపడుతున్న డి లిమిటేషన్ అంశంపై చేపట్టాల్సిన వ్యూహం పై నాయకులు మాట్లాడారు.





Post a Comment

Previous Post Next Post