రాఖీ పండుగ వేళ సీఎం రేవంత్ కు రాఖీ కట్టిన కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ
హైదరాబాద్, ఆగస్టు 28:
రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ మర్యాదపూర్వకంగా కలిశారు.
సీఎం నివాసంలో ఆయనకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ రోజు సీఎంకు రాఖీ కట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఇందుప్రియ తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, రాఖీ పండుగ సోదర సోదరీమణుల మధ్య ప్రేమానుబంధాలను మరింత పెంచాలని ఆకాంక్షించారు.

Post a Comment