బాన్సువాడ MEOకు ఉపాధ్యాయ సంఘాల వినతిపత్రం
సెన్సస్ సర్టిఫికెట్లు, అన్ని సంఘాలకు సమాన అవకాశం ఇవ్వాలని వినతి
బాన్సువాడ: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంబంధించి బాన్సువాడ మండల విద్యాధికారి నాగేశ్వర్ రావును మంగళవారం ఉపాధ్యాయ సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు.సంఘాల తరపున నాయకులు MEOను కలిసి 3 ప్రధాన అంశాలను ప్రస్తావించారు.
సంఘాల డిమాండ్లు:
1. సెన్సస్ సర్టిఫికెట్లు జారీ చేయాలి - 2026 ఏప్రిల్, మే నెలల్లో జరిగిన జనగణన సెన్సస్ విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు హాజరు సర్టిఫికెట్లను వెంటనే అందజేయాలి.
2. MRC కార్యక్రమాల్లో అందరికీ అవకాశం - MRC ఆధ్వర్యంలో జరిగే శిక్షణలు, సెమినార్లు, ఇతర కార్యక్రమాల్లో ఒకే సంఘానికి పెద్దపీట వేయకుండా అన్ని ఉపాధ్యాయ సంఘాలకు సమాన అవకాశం కల్పించాలి.
3. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి - ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.
వినతిపత్రాన్ని స్వీకరించిన MEO నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, అన్ని ఉపాధ్యాయ సంఘాలు తమకు సమానమేనని స్పష్టం చేశారు. ఏ ఒక్క సంఘానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండదని, అందరూ కలిసి ఐక్యంగా పనిచేసి విద్యా కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో SGT యూనియన్, TRTF, LFL HM యూనియన్, SCST యూనియన్, TPUS యూనియన్ నాయకులు పవార్ హీరాల్, శ్రీనివాస్ రావు, జాగృతి, దేవి సింగ్, పోతుగంటి వార్ హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment