వేసవి తాపానికి ఉపశమనం : మజ్జిగ పంపిణీ కేంద్రం ప్రారంభం
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
కామారెడ్డి పట్టణంలో ఎండలు మండిపోతున్న వేళ ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ పంపిణీ కేంద్రం ఏర్పాటైంది.
ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభం
స్టేషన్ రోడ్డులోని _కామారెడ్డి ఫార్మసీ & సర్జికల్ స్టోర్_ వద్ద వేసవి తాపం దృష్ట్యా ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదివారం ఉదయం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ, "రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోడ్డుపై వెళ్లే వాహనదారులు, పాదచారులు, కూలీలు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ఈ మజ్జిగ పంపిణీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని జరగాలి" అని అన్నారు.
సేవా కార్యక్రమాలకు పిలుపు
వేసవి కాలం పూర్తయ్యే వరకు ఈ కేంద్రంలో నిరంతరం చల్లటి మజ్జిగ అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. దాతలు, వ్యాపారస్తులు ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వర్తక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


Post a Comment