గడ్డి మందు తాగి యువకుడు మృతి
బాన్సువాడ మండలం తిరుమలపూర్లో ఘటన
కారణాలు తెలియరాలేదు: పోలీసులు కేసు నమోదు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 14: బాన్సువాడ మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన యువకుడు గడ్డి మందు సేవించి మృతి చెందాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
తిరుమలపూర్కు చెందిన జక్కాపురం సందీప్ (19), తండ్రి లేట్ నారాయణ, కుర్మా కులస్థుడు. బర్ల కాపరిగా జీవనం సాగించేవాడు. జూన్ 12 మధ్యాహ్నం గుర్తుతెలియని కారణాల వల్ల పారాక్వాట్ డైక్లోరైడ్ అనే గడ్డి మందును సేవించాడు. అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ జూన్ 13 రాత్రి 7:52 గంటలకు సందీప్ మృతి చెందాడు.
తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడు గడ్డి మందు సేవించడానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని బాన్సువాడ పోలీసులు తెలిపారు.

إرسال تعليق