Top News

Road Accident | కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం 

ఎలక్ట్రిక్ స్కూటీపై వెళ్తున్న బాలుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

కామారెడ్డి, సెప్టెంబర్ 04: కామారెడ్డి పట్టణంలోని న్యూ బస్టాండ్ సమీపంలో ఉన్న ఇంటర్నేషనల్ హోటల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన హేమంత్ (15), లోకేష్ (16) అనే ఇద్దరు బాలురు ఎలక్ట్రిక్ స్కూటీపై వెళ్తుండగా రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఢీకొన్న రెండు కార్ల మధ్యలో వీరి స్కూటీ ఇరుక్కుపోయింది.

ఈ ప్రమాదంలో హేమంత్ అక్కడికక్కడే మృతి చెందగా, లోకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన లోకేష్ ను, హేమంత్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. CC TV FOOTAGE 👇






Post a Comment

Previous Post Next Post