నలుగురు నిందితుల అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం
ప్రభుత్వ ఆస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసుల విజ్ఞప్తి
కామారెడ్డి: రామారెడ్డి పోలీసుల చాకచక్యంతో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్లో దొంగతనానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. చోరీకి గురైన కేబుల్ వైర్ బండిల్ను స్వాధీనం చేసుకున్నారు.రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెం. 156/2026, U/Sec. 331(3), 305(a) BNS కింద నమోదైన ఈ కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు.
ఈ నెల 18-07-2026న రెడ్డిపేట గ్రామ సమీపంలోని స్వయంభూశ్వరి ఆలయం వద్ద ఉన్న బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్లో గుర్తు తెలియని వ్యక్తులు కేబుల్ వైర్లను చోరీ చేశారు. ఈ ఘటనపై బీఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికాం అధికారి నల్లవెల్లి శ్రీధర్ ఫిర్యాదు చేయడంతో రామారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా 22-07-2026న జగదాంబ తండా జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అందులోని వ్యక్తులు పారిపోవడానికి యత్నించగా, పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్లో కేబుల్ వైర్లు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి చోరీకి గురైన కేబుల్ వైర్ బండిల్ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరాలు:
1. పుప్పాల కిరణ్ కుమార్, ఇసాయిపేట్, రామారెడ్డి
2. కల్లెం సతీష్
3. పార్టం గాబ్రియల్
4. గంగారాం
పై ముగ్గురు నిందితులు మెదక్ జిల్లాకు చెందినవారు.
నిందితులను గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా రిమాండ్ విధించడం జరిగింది.
ప్రజలకు విజ్ఞప్తి: ప్రభుత్వ ఆస్తుల దొంగతనాలు, విధ్వంసక చర్యలు లేదా అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని రామారెడ్డి పోలీసులు కోరుతున్నారు.

Post a Comment