డీసీఎం వ్యాన్ ఢీకొని 20 మేకల మృతి
మేకల కాపరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ఎల్లారెడ్డి పోలీసుల దర్యాప్తు
తెలంగాణ డైలీ న్యూస్, లింగంపేట, జూన్ 12: కామారెడ్డి జిల్లా లింగంపేట ఎల్లారెడ్డి మండలాల సరిహద్దు కొట్టాల్ గ్రామ స్టేజి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మేకలు మృతిచెందాయి. మేకల కాపరి తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదం వివరాలు
గ్రామస్తుల కథనం ప్రకారం కొట్టాల్కు చెందిన ఆలకుంట శివయ్య, బోదాస్ గంగారాం, కిషన్ తమ మేకలను కొట్టం నుంచి వదిలి మేత కోసం అడవికి తోలుకెళ్తున్నారు. అదే సమయంలో కామారెడ్డి వైపు నుంచి ఎల్లారెడ్డి వైపు అతివేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ మేకలను, కాపరి శివయ్యను ఢీకొట్టింది.
నష్టం వివరాలు
ఈ ప్రమాదంలో ఆలకుంట శివయ్యకు చెందిన 13 మేకలు, బోదాస్ గంగారాంకు చెందిన 2 మేకలు, కిషన్కు చెందిన 5 మేకలు అక్కడికక్కడే మృతిచెందాయి. డీసీఎం తాకిడికి శివయ్య తలకు బలమైన గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
ఆసుపత్రికి తరలింపు
తీవ్రంగా గాయపడిన శివయ్యను 108 అంబులెన్స్లో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్గా ఉందని వైద్యులు తెలిపారు.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment