•బోధన్ ఎస్సై ఏసీబీకి చిక్కాడు – రూ.7 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టివేత
•కేసు నుంచి తప్పించేందుకు రూ.10 వేలు డిమాండ్, రూ.7 వేలకు బేరం
•నిందితుడిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న అధికారులు
తెలంగాణ డైలీ న్యూస్, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ చిట్టన్నోజు భాస్కర చారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. లంచం తీసుకుంటుండగా పోలీస్ స్టేషన్లోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
06.05.2026న ఫిర్యాదుదారుడి సోదరుడి కొడుకును క్రిమినల్ కేసులో ఇరికించకుండా ఉండేందుకు అధికారిక సాయం చేసేందుకు ఎస్సై భాస్కర చారి లంచం డిమాండ్ చేశాడు. మొదట రూ.10,000 డిమాండ్ చేయగా, ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు రూ.7,000కు తగ్గించాడు.
ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు వలపన్ని, లంచం తీసుకుంటున్న సమయంలో ఎస్సైను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సొమ్ము రూ.7,000ను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందిత అధికారి తన విధులను అప్రామాణికంగా, అవినీతితో నిర్వర్తించినట్లు ఏసీబీ పేర్కొంది. భద్రతా కారణాల రీత్యా ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచారు.
నిందిత ఎస్సై భాస్కర చారిని అరెస్టు చేసి హైదరాబాద్ నాంపల్లిలోని గౌరవనీయ II అడిషనల్ స్పెషల్ జడ్జి ఫర్ ట్రయల్ ఆఫ్ ఎస్పీఈ & ఏసీబీ కేసుల కోర్టులో హాజరుపర్చనున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి: ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని ఏసీబీ కోరింది. వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్బుక్ Telangana ACB, X @Telangana ACB ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపింది.

Post a Comment