కామారెడ్డి జిల్లా సామిల్ అసోసియేషన్ నూతన బాధ్యులకు ఘన సన్మానం
పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజు చేతుల మీదుగా సత్కారం
బాన్సువాడ : కామారెడ్డి జిల్లా సామిల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన నవీద్, జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన అజీమ్ ఖాన్ని ఘనంగా సన్మానించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే , పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో చైర్మన్ బాలరాజు పాల్గొని నూతన బాధ్యులను అభినందించి శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎరువల కృష్ణారెడ్డి, వహాబ్, బాన్సువాడ పట్టణ వడ్రంగి సంఘం అధ్యక్షులు సర్దార్, సంఘం గౌరవ అధ్యక్షులు గోంట్యాల బాలకృష్ణ పాల్గొన్నారు.
అదేవిధంగా సంఘ సభ్యులు సంజు, రవి, మధు, భూషణ్, గంగాధర్, శీను తదితరులు హాజరై నూతన బాధ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నవీద్, అజీమ్ ఖాన్ లు సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.






Post a Comment