Top News

MLA PSR Clearity | ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం: పోచారం

ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం: పోచారం  

ప్రజా సేవే పరమావధి

నాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు 

విమర్శలపై పోచారం క్లారిటీ

వర్నిలో రూ.30 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభం 

బాన్సువాడ : నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జోకోరా గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 

విమర్శలపై పోచారం క్లారిటీ

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయనపై వస్తున్న విమర్శలు, వ్యాఖ్యలపై పోచారం సమాధానం ఇచ్చారు.  

తన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని అన్నారు. తాను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, ఎవరి వద్దా డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. తనకు స్వార్థం ఉందంటూ కొందరు బుద్ధిహీనులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  గతంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. కెసిఆర్ చేసిన అభివృద్ధి పనులను ప్రశంసించిన సందర్భంలో కెసిఆర్ చేశారు కాబట్టే ప్రశంసించానని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను కూడా ప్రజలకు వివరిస్తానని చెప్పారు.

ప్రజా సేవే పరమావధి

ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేశానని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు అనుకూలంగా పనిచేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఏడు దఫాలుగా ప్రజా ప్రతినిధిగా సేవ చేసే అవకాశం తనకు లభించిందని గుర్తు చేశారు.  నియోజకవర్గ ప్రజల కోసం ఏదైనా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.

సహకరించిన వారికి కృతజ్ఞతలు  

నియోజకవర్గ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరి పేరును ప్రస్తావించడం తన బాధ్యత, మానవత్వం అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల్లో సహకరించిన వారిని గుర్తించి వారికి కృతజ్ఞతలు చెప్పడం తప్పు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

బాన్సువాడలో 30 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభం 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలోని జాకోర, శంకోర గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్.డి.ఓ  విజయకుమారి, వర్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జాకోరలో మహిళా సంఘ భవనం ప్రారంభం  

జాకోర గ్రామంలో SDF నిధుల ద్వారా 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు ఇటువంటి భవనాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

PACS ఆధ్వర్యంలో దుకాణ సముదాయం, ప్రహరీ గోడ  

అదే గ్రామంలోని జాకోర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం PACS ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయం మరియు ప్రహరీ గోడను కూడా ఆయన ప్రారంభించారు. రైతులకు అవసరమైన సేవలు ఒకే చోట అందుబాటులో ఉండేలా ఈ నిర్మాణాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

శంకోరలో 20 లక్షలతో పంచాయతీ భవనం  

శంకోర గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని పోచారం ప్రారంభించారు. గ్రామ పాలన మరింత పటిష్టంగా సాగేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.

మొత్తంగా ఈ రెండు గ్రామాల్లో 30 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించడం ద్వారా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను పోచారం శ్రీనివాస్ రెడ్డి వివరించారు.ఈ కార్యక్రమాలకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.










Post a Comment

أحدث أقدم