బాన్సువాడలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించిన మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్
బాన్సువాడ, సెప్టెంబర్ 02:
పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన జననేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు.
ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ, వైఎస్సార్ పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు చరిత్రలో చెరగని ముద్ర వేశాయన్నారు. ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలతో ప్రజా సంక్షేమ పాలనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని కొనియాడారు.
వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, ఆయన చూపిన మార్గంలో ప్రజా సేవ చేయడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు మహ్మద్ ఖాలెక్, నార్ల నందకిశోర్, అశోక్ రెడ్డి, మట్ట సాయిలు,షేక్ అజీమ్, అఫ్రోజ్, షహాబ్, కాంగ్రెస్ పట్టణ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, వార్డు నాయకులు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.

إرسال تعليق