Top News

BRS Membership Drive | బాన్సువాడలో భారీగా సభ్యత్వ నమోదు చేపట్టాలి : వీ జీ గౌడ్

 


బాన్సువాడలో భారీగా సభ్యత్వ నమోదు చేపట్టాలి : వీ జీ గౌడ్

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపు

మళ్ళీ బీఆరెస్ జెండా ఎగరాలి: నియోజకవర్గ ఇంచార్జి తోట ఆగమయ్య

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సమన్వయ కమిటీ సమావేశం

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బాన్సువాడలో భారీగా సభ్యత్వ నమోదు చేపట్టాలని  బీఆరెస్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి విజి గౌడ్ పేర్కొన్నారు.  సోమవారం బాన్సువాడలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై మండలాల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇంచార్జి విజి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

ఈ సందర్భంగా విజి గౌడ్ మాట్లాడుతూ, 59 మంది సమన్వయ కమిటీ సభ్యులను నియమించామని తెలిపారు. 9 మండలాలు, ఒక మున్సిపాలిటీలో ఐదుగురు చొప్పున నియమించామని, సభ్యత్వ నమోదులో డిజిటలైజేషన్, ఫోన్ ద్వారా 528 మంది సభ్యత్వం చేస్తారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పోచారంనకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చి 12వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లు, రోడ్లు ఇచ్చారని, కానీ ఆయన కాంగ్రెస్‌లో చేరారని అన్నారు. ప్రస్తుత రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని, దానికి పోచారం ఫోన్ కాల్ వైరల్ కావడమే నిదర్శనమన్నారు. కేసీఆర్ అంటేనే బ్రాండ్ అని, ప్రజల్లో మనం చేసిన అభివృద్ధి నాటుకుపోయిందన్నారు. మండలానికి ఐదుగురు కేసీఆర్ లాగా, ఆయన ప్రతినిధులుగా పని చేయాలని, బూత్ సభ్యులను కలుపుకుపోవాలని సూచించారు. సభ్యత్వం కోసం టెక్నీషియన్స్‌కు శిక్షణ ఇస్తారని, కామారెడ్డిలో 4 నియోజకవర్గాలకు శిక్షణ, జనగణ, సర్ ప్రోగ్రాం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ ఏ టీమ్, కాంగ్రెస్ బి టీమ్ అని ప్రజలకు తెలుసని, సభ్యత్వ ఫీజును కేసీఆర్ తగ్గించారని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల గురించి, కాంగ్రెస్ వైఫల్యాల గురించి ప్రచారం చేయాలని, ఎస్‌ఐఆర్ గురించి అవగాహన కల్పించాలన్నారు. అరబ్ దేశాల్లో ఉన్న వారి ఓట్లు తొలగించకుండా కేటీఆర్ ఒక ప్రతినిధి బృందాన్ని ఎలక్షన్ కమిషన్‌కు విన్నవించేందుకు పంపిస్తున్నారని తెలిపారు.  

కాంగ్రెస్ పూర్తిగా విఫలం: బాజిరెడ్డి గోవర్ధన్

బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, రెండేళ్లలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు.  సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ కోసం కేటీఆర్‌కు సన్నిహితులు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆగయ్య వచ్చారన్నారు. ప్రతి మండలంలో సమన్వయ కమిటీలు మెంబర్‌షిప్ ను పర్యవేక్షిస్తాయని అన్నారు. జనంలో మనం ఉన్నామని, కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. వచ్చే రెండేళ్లలో జాగ్రత్తగా ఉండాలని, మహిళలకు రూ.2,500 ఇస్తామని ఇవ్వలేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు రేవంత్ అమలు చేయలేదని విమర్శించారు. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే పార్టీ పేరు బయటకు వస్తుందని, ఈ కార్యక్రమాన్ని గట్టిగా చేయాలన్నారు. తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఆ తర్వాత కేసీఆర్ దయ వల్ల ఇక్కడ అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం లో నియోజకవర్గానికి నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. మళ్లీ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లోకి వస్తే తీసుకునేది లేదన్నారు. మనం గెలవాలని, మన ప్రభుత్వం రావాలనే కక్షతో బీఆర్ఎస్ కార్యకర్తలు పని చేయాలని, మెంబర్‌షిప్ చేయించి కష్టపడాలని పిలుపునిచ్చారు.  

బాన్సువాడలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరాలి: తోట ఆగమయ్య 

సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇంచార్జి తోట ఆగమయ్య మాట్లాడుతూ బాన్సువాడలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరాలని పేర్కొన్నారు.  కేసీఆర్ హయాంలో నే ఇక్కడ అభివృద్ధి జరిగిందని అన్నారు. బూత్ స్థాయి నాయకులతో కలిసి పార్టీలో మార్పులు, చేర్పులు, వార్డు కమిటీలు, సభ్యత్వ నమోదు కోసం కేటీఆర్ తనను పంపారన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తానని, పార్టీ కార్యక్రమాలను సక్రమంగా చేసే వారే కావాలని, కిందిస్థాయిలో పని చేసే వారినే ఎంపిక చేద్దామన్నారు. మండలాల వారీగా కూర్చొని కమిటీలు వేసుకుందామన్నారు.  

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, జుబేర్, రాంచందర్, కౌన్సిలర్లు మకబూల్, ఫెరోజ్, ఖలీల్, ఖాదర్, హకీం, దాస్, రవి, ధర్మంతేజ్, అతిఫ్, ఈసాక్, అక్బర్, బాడీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.  








Post a Comment

Previous Post Next Post