100 ఏళ్ల సాయమ్మకు నాలుగు తరాల నీరాజనం
కాళ్లు కడిగి ఆశీస్సులు అందుకున్న మునిమనవలు
స్వాతంత్ర్యం నుంచి స్మార్ట్ఫోన్ దాకా సాగిన జీవన ప్రయాణం
(తెలంగాణ డైలీ న్యూస్-బాన్సువాడ)
బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనం ఓ అపురూప సంగమానికి వేదికైంది. ఎన్నూవార్ సాయమ్మ శత వసంతాలు పూర్తి చేసుకున్న వేడుకను నాలుగు తరాల కుటుంబ సభ్యులు కలిసి కన్నుల పండుగగా జరుపుకున్నారు.
మంగళ వాయిద్యాల నడుమ మనవరాళ్లు, మునిమనవళ్లు బామ్మకు ఘన స్వాగతం పలికారు. శతాధిక వృద్ధురాలి ఆయురారోగ్యం కోసం గణపతి పూజ, లలితా సహస్రనామ పారాయణం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లు వరుసగా వచ్చి బామ్మ కాళ్లు కడిగి, ఆశీస్సులు అందుకున్న దృశ్యం అందరినీ కదిలించింది. శాలువాలు, పూలదండలు, జ్ఞాపికలతో సాయమ్మను ఘనంగా సత్కరించారు.
కేక్ కట్ చేసిన సాయమ్మ అందరినీ మనసారా ఆశీర్వదించారు. ఆమె పేరు మీద అన్నదానం చేశారు. వృద్ధాశ్రమానికి విరాళం అందించారు. భవిష్యత్ తరాలకు గుర్తుగా మొక్కలు నాటారు. శత వసంతాల సాక్షిగా నిలిచిన సాయమ్మను చూసి నాలుగు తరాల బంధువులు సంబరపడ్డారు.


Post a Comment