(తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో-హైదరాబాద్)
రాష్ట్ర ఎన్నికల సంఘం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరం చేసింది. మే 2026లో పోలింగ్ నిర్వహించే లక్ష్యంతో కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యాంశాలు:
👉 స్థానాల వివరాలు:
- జడ్పీటీసీ స్థానాలు: 566
- ఎంపీటీసీ స్థానాలు: 5,773
- జిల్లా పరిషత్లు: 31. మేడ్చల్-మల్కాజిగిరి పూర్తి పట్టణ జిల్లా కావడంతో జడ్పీ లేదు.
- తగ్గిన స్థానాలు: 2019తో పోలిస్తే 4 జడ్పీటీసీ, 44 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. కారణం: పలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం.
👉ఓటర్ల జాబితా ప్రక్రియ:
- ఆధారం: కేంద్ర ఎన్నికల సంఘం 10 జూలై 2025 నుంచి 5 ఫిబ్రవరి 2026 వరకు నవీకరించిన ఓటర్ల జాబితా
- డెడ్లైన్: డేటాలో లోపాలను 23 ఏప్రిల్ 2026 లోపు నివేదించాలి
- తదుపరి దశలు: ముసాయిదా జాబితా విడుదల → అభ్యంతరాల స్వీకరణ → తుది జాబితా ప్రకటన
-మినహాయింపు: హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు ఎన్నికలు లేవు
👉 నేపథ్యం:
-చివరిసారి ఎన్నికలు: మే 2019లో 3 దశల్లో జరిగాయి
- ప్రస్తుత పరిస్థితి: జూన్ 2025తో ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది
- జాప్యానికి కారణం: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు కేసు. తాజాగా కోర్టు అనుమతితో లైన్ క్లియర్ అయింది
👉రాజకీయ ప్రాధాన్యత:
- సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ ఇదే జోష్ కొనసాగించాలని చూస్తోంది.
- BRS, BJP కూడా పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వ్యూహాలు రచిస్తున్నాయి.
👉తదుపరి చర్యలు: ఓటర్ల జాబితా ఫైనల్ అయ్యాక బ్యాలెట్ బాక్సుల తయారీ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు మొదలవుతాయి.
.jpeg)

Post a Comment