తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
గంజాయి తాగుతున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సి ఐ శ్రీధర్ తెలిపారు.శనివారం మధ్యాహ్నం సమయంలో ఇబ్రహీంపేట్ గ్రామ సమీపంలో కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని సమాచారం పై ఎస్సై టి వెంకట్రావు సిబ్బందితో వెళ్లి గంజాయి తాగుతున్న ముగ్గురిని పట్టుకొన్నారని తెలిపారు. వారికి డ్రగ్ పరీక్షలు నిర్వహించి పాజిటివ్ రావడంతో పంచుల సమక్షంలో వారి వద్ద నుండి 15 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Post a Comment