Indiramma Houses | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కామారెడ్డి జిల్లా 10వ స్థానం

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కామారెడ్డి జిల్లా 10వ స్థానం

75.44% ఇళ్లు పూర్తి, రూ.210.57 కోట్లు చెల్లింపు  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎల్లారెడ్డి సెగ్మెంట్ ఫస్ట్

జూన్ 2లోపు మిగిలిన గృహప్రవేశాలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం

(తెలంగాణ డైలీ న్యూస్-కామారెడ్డి)

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగానే సాగుతోంది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కామారెడ్డి జిల్లాకు 12,090 గృహాలు కేటాయించగా 11,592 మంజూరయ్యాయి. వాటిలో 9,121 ఇళ్లు పూర్తి కావడంతో 75.44% పురోగతితో జిల్లా రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.210.57 కోట్లు చెల్లించారు.

గృహప్రవేశాలపై కలెక్టర్ ఆదేశం  

జిల్లాలో సామూహిక గృహ ప్రవేశాల కోసం 3,136 గృహాలకు గాను 1,604 పూర్తయ్యాయి. మిగిలిన 1,532 గృహాలను జూన్ 2వ తేదీలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీవో, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, సహాయక ఇంజినీర్లు, పంచాయతీ సెక్రటరీలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేసి గృహప్రవేశాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా 2,898 ఇళ్లు పూర్తి కాగా, కామారెడ్డిలో 2,688, జుక్కల్‌లో 2,571, బాన్సువాడలో 964 ఇళ్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహిస్తున్నారు.

నియోజకవర్గాల వారీగా పూర్తైన ఇళ్లు

నియోజకవర్గం కేటాయింపు మంజూరైన ఇండ్లు ఫినిషింగ్ పురోగతి గల ఇండ్లు పూర్తి %

కామారెడ్డి 3500 3435 487 2688 78.26%

ఎల్లారెడ్డి 3500 3557 490 2898 81.47%

జుక్కల్ 3500 3270 439 2571 78.62%

బాన్సువాడ1590 1330 188 964 72.48%

మొత్తం 12090 11592 1604 9121  75.44%

మొత్తం చెల్లింపులు: రూ.210.57 కోట్లు  

సామూహిక గృహప్రవేశాల లక్ష్యం: 3,136 ఇళ్లు  

పూర్తయిన గృహప్రవేశాలు: 1,604  

మిగిలిన గృహప్రవేశాలు: 1,532  

డెడ్‌లైన్: జూన్ 2, 2026


ఇందిరమ్మ ఇళ్లలో కామారెడ్డి జిల్లా 10వ స్థానం:

మే 22, 2026 నాటికి కామారెడ్డి జిల్లా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో 75.44% పూర్తి చేసి రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. లక్ష్యానికి చేరువగా ఉన్నా, మొదటి ఐదు స్థానాల్లోకి రాలేకపోయింది. ఈ అంకెలను విడదీస్తే మూడు ముఖ్యమైన అంశాలు కనిపిస్తాయి.

మంజూరు vs పూర్తి: వేగంలో తేడా  

జిల్లాకు 12,090 ఇళ్లు కేటాయించగా 11,592 మంజూరయ్యాయి. అంటే మంజూరు రేటు 95.88%. ఇది మంచి సూచిక. కానీ మంజూరైన వాటిలో పూర్తయింది 9,121 మాత్రమే, అంటే 78.68%. మంజూరు వేగం, నిర్మాణ వేగం మధ్య దాదాపు 17% గ్యాప్ ఉంది. నిధులు రూ.210.57 కోట్లు విడుదలైనా, క్షేత్రస్థాయిలో అమలులో జాప్యం కనిపిస్తోంది. అయితే ఇసుక కొరత, సిమెంట్ ధరలు పెరగడం, ఇతర ముడి సరకు ధరలు పెరగడం వల్ల ఇంటి నిర్మాణాలపై ప్రభావం పడుతోంది.

 నియోజకవర్గాల మధ్య అసమానత  

ఎల్లారెడ్డి 81.47% పూర్తితో జిల్లాలోనే ముందుంది. 3,557 మంజూరైన ఇళ్లలో 2,898 పూర్తయ్యాయి. జుక్కల్ 78.62%, కామారెడ్డి 78.26% తో దాదాపు సమానంగా ఉన్నాయి. కానీ బాన్సువాడ 72.48%తో వెనుకబడింది. బాన్సువాడ నియోజకవర్గం లోని బాన్స్వాడ, నసురులాబాద్, బీర్కూర్ మండలాల్లో కలిపి  1,590 కేటాయించగా,  బాన్సువాడలో మంజూరు  1,330 మంజూరు చేశారు.  3,136 ఇళ్లను సామూహిక గృహప్రవేశాలకు గుర్తిస్తే 1,604 మాత్రమే రెడీగా ఉన్నాయి. అంటే 51.15% మాత్రమే. జూన్ 2 డెడ్‌లైన్‌కు ఇంకా 1,532 ఇళ్లు పూర్తి చేయాలి. రోజుకు సగటున 128 ఇళ్లు అప్పగించాలి. ఫినిషింగ్ దశలో 1,604 ఇళ్లు ఉన్నాయని డేటా చెబుతోంది. అవి పూర్తయితేనే లక్ష్యం చేరుతుంది. ఎంపీడీవో, ఇంజినీర్లు, పంచాయతీ సెక్రటరీల సమన్వయంపైనే ఇది ఆధారపడి ఉంది. రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంక్ అంటే మధ్యస్థ పనితీరు. టాప్ 5లోకి రావాలంటే మంజూరు-పూర్తి గ్యాప్‌ను 10%లోపు తగ్గించాలి. 

Post a Comment

Previous Post Next Post